రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. నగరంలోని గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.