రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్ల సూచనమేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత వారం రోజుల్లో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave A Reply

Your email address will not be published.