రాష్ట్రంలో గొర్రెల పంపిణీ నేటి నుంచి..

హైదరాబాద్ : కరోనా మ‌హ‌మ్మారి మూలంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ నేటి (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డీడీలు చెల్లించిన 28,335 మందికి 5.95 లక్షల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయినట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు. మ‌రికాసెప‌ట్లో (ఇవాళ ఉదయం 11.30 గంటలకు) మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండలోని బత్తాయి మార్కెట్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.