రేపు, ఎల్లుండి బ్యాంకుల స‌మ్మె

న్యూఢిల్లీ: రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు చెందిన దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 15, 16 తేదీల్లో స‌మ్మె చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ నెల 13న రెండో శ‌నివారం, 14న ఆదివారం బ్యాంకింగ్ సేవ‌లు ఉండ‌వు. ఇక సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఉద్యోగుల స‌మ్మె వ‌ల్ల వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవ‌ల‌పై తీవ్ర ప్ర‌భావమే క‌నిపించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.