వంటిమామిడి మార్కెట్యార్డును సందర్శించిన కెసిఆర్
ములుగు: సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్యార్డును బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ను పరిశీలించిన సిఎం కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, తదితరులు ఉన్నారు.