సీఎం బహిరంగ సభ.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎల్బీ స్టేడియంలోని సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రేపు హైదరాబాద్లోని పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంట్రోల్ రూమ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు.. అబిడ్స్, గన్ఫౌండ్రీ నుండి వచ్చే వాహనాలు ఎస్బీఐ, చాపెల్ రోడ్ వైపు.. బషీర్బాగ్, అబిడ్స్ నుండి వచ్చే వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కోఠి వైపు.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వచ్చే వాహనాలు హిమాయత్నగర్ వైపు.. లిబర్టీ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్నగర్ మీదుగా మళ్లింపు చేపట్టారు.
వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు..
సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు స్థలాలను సూచించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు స్టేడియం గేట్-జి వద్ద దిగాలన్నారు. ఈ వాహనాలను పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, ఐమాక్స్ వద్ద పార్కింగ్ చేయాలన్నారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, పాతబస్తీ నుంచి వచ్చేవారు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగాలన్నారు. పబ్లిక్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. ముషీరాబాద్, అంబర్పేట, హిమాయత్నగర్ నుంచి వచ్చేవారు స్టేడియం గేట్ ఎఫ్, గేట్ ఎఫ్-1 వద్ద దిగి నిజాం కళాశాల వద్ద పార్కింగ్ చేయాలన్నారు. మోహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు గేట్-జీ వద్ద దిగి వాహనాలను నిజాం కళాశాల వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు.