సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు.. కవిత రాసిన మోదీ
హైదరాబాద్: ఆస్మాన్ మే సర్ ఉటాకర్.. ఘనే బాదలోంకో చీర్ కర్.. రోషినీ కా సంకల్ప్ లే.. అబీ తో సూరజ్ ఉగా హై.. ఇదీ ప్రధాని మోదీ రాసిన కవిత. 2021 కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఈ కవితను రాసినట్లు తెలుస్తోంది. మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ఈ కవితతో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు. వినీల ఆకాశంలో తల ఎత్తుకుని ఉండాలని.. దట్టమైన మేఘాలను చీల్చుకుని.. వెలుగు లాంటి సంకల్పంతో ముందకు సాగాలని.. ఇప్పుడే సూర్యుడు ఉదయించాడన్న అంశాన్ని ప్రధాని మోదీ తన కవితలో తెలిపారు. మోదీయే స్వయంగా ఆ కవితను చదివారు.
Let’s start our first day of the new year with a mesmerizing and motivating poem ‘Abhi toh Suraj Uga hai’, written by our beloved PM @narendramodi. @PIB_India @MIB_India @PMOIndia pic.twitter.com/9ajaqAX76w
— MyGovIndia (@mygovindia) January 1, 2021