హయత్ నగర్ కార్పోరేటర్పై దాడి

హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.. అయితే వరద ముంపు బాధితుల పరామర్శలకు వెళ్లే నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా హయత్నగర్ కొర్పొరేటర్కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ మద్య కాలంలో కురిసి భారీ వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. అయితే వరద ముంపు పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. ఈయన వెళ్లిందే తడవుగా ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ అయితే ఏకంగా కార్పోరేటర్ చొక్కా పట్టుకుని మరీ నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో ఒకక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏది ఏమైనా భాగ్యనగర వాసులు నాయకులు చుక్కలు చూపిస్తున్నారు.