హైకోర్టు సిజె హిమా కోహ్లీని కలిసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.