1 నుంచి ఒంటిపూట బడులు: మంత్రి ఆదిమూలపు

అమరావతి: ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్.