11 మంది కస్తూర్బా విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

సంగారెడ్డి (CLiC2NEWS): కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో 11 మంది విద్యార్థులు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. పాఠశాలలో ఇటీవల నిర్మాణ పనులు చేపట్టారని, దాంతో పాటు గోడలకు రంగులు వేశారని , ఆ వాసనలకు విద్యార్థులకు దగ్గు, శ్వాస సమస్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థులలో 8 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో ముగ్గురికి దగ్గు తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.