150కి చేరిన కొత్త రకం కరోనా కేసులు

న్యూఢిల్లీ: కొత్త రకం కరోనా కేసులు భారత్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల సంఖ్య 150కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ సోకిన వారిని ప్రత్యేక ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొంది. వారిని కలిసిన వ్యక్తులను కూడా గుర్తించి క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొంది. కాగా కొత్త రకం కేసుల నమోదు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది