2 బైక్‌లు ఢీ: ముగ్గురు మృతి

మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద శ‌నివారం రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొన్న ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నె స్థానికులు గుర్తించి గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్ర‌మాదంలో మృతిచెందిన వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.