బిల్డింగ్పై ఉన్న విద్యుత్ తీగలు తాకి మూడేళ్ల చిన్నారి మృతి

కాకినాడ (CLiC2NEWS): విద్యుదాఘాతంతో 14 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి శుక్రవారం మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పైడిమెట్ట గ్రామంలో దర్శిత్ (3) చిన్నారి తల్లితో పాటు భవనంపైకి వెళ్లాడు. తల్లి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారికి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురైనాడు. వెంటనే ఆచిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి కాకినాడ జిజిహెచ్కు తీసుకెళ్లారు. నాలుగు రోజులు చికిత్స అందించిన అనంతరం ఆచిన్నారికి ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు కాళ్ళూ మోకాళ్ల కింద వరకు తొలగించారు. ఇన్ఫెక్షన్ తగ్గకపోతే మోకాళ్లనూ తొలగించాల్సి వస్తుందని డాక్టర్స్ చెప్పారు.
అయినా ఆ చిన్నారికి ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో శుక్రవారం కుడికాలు మోకాలుపై వరకు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఇది జరిగిన కొంత సమయానికే ఆ చిన్నరి గుండె నెమ్మదిగా కొట్టుకొంటుందని గుర్తించే లోపలే చిన్నారి మృతి చెందాడు. 14 రోజులు మృత్యువుతో పోరాడి కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.