5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమిపూజ

హైదరాబాద్ : కోకాపేటలో ముదిరాజ్లకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశానుసారం బీసీల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా త్వరలోనే అన్ని కులాల భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోకాపేటలో 13 కులాలకు, ఉప్పల్ భగాయత్లో 25 కులాలకు, మల్కాజ్గిరి, బాట సింగారంలో 40 కులాలకు 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా భవన నిర్మాణాలకు గాను రూ.95.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని కులాల భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేశవ్రావు, బండ ప్రకాశ్, రంజిత్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Laid foundation for the construction of Mudiraj Community self-respect building with an estimation of Rs 5 Crore along with MP K Keshava Rao Garu, Colleague Ministers @Eatala_Rajender Garu, @YadavTalasani Garu, @SabithaindraTRS Garu, Leaders and officials at Kokapet pic.twitter.com/npz4Ejjo3T
— Gangula Kamalakar (@GKamalakarTRS) January 10, 2021