రెండున్న‌రేళ్లలో రూ.50వేల కోట్ల‌తో ప‌నులు: సిఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రానున్న‌ రెండున్న‌రేళ్లలో రూ.50వేల కోట్ల‌తో ప‌నుల‌న్నీ పూర్తి చేయనున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల‌న్నింటికీ 3 నెల‌ల్లో భూసేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. బెంగ‌ళూరు-క‌డ‌ప‌-వ‌జ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్ వేకు ప‌లు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఈ ప్రాజెక్టుల‌కు 15 రోజుల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు సాధించాల‌న్నారు. నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో ప‌నులు పూర్తి చేయాల‌ని సిఎం ఆదేశించారు. దాదాపు రూ.18వేల కోట్ల‌తో ప‌నులన్నీ పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.