6న‌ ప్రధానితో సిఎం జగన్‌ భేటి

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటి కానున్నారు. ఇటీవలే హోంమంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి 6వ తేదీ ఉద‌యం ప్రధానితో భేటి కానున్నారు. ఈ భేటిలోనూ రాష్ట్ర ఆర్ధికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించనున్నారు. ప్రధాని దృష్టికి కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను తీసుకెళ్లి త్వరగా పరిష్కరింపచేయాలని కోరడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం సోమవారం నాడు సిఎం జగన్‌ పులివెందుల వెళతారు. అక్కడ తన మామ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గంటారు. అక్కడ నుంచి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు.

Leave A Reply

Your email address will not be published.