Ramagundam: ప‌దోన్న‌తులు పొందిన ఆరుగురు పోలీసు అధికారులు

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ (CLiC2NEWS): ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 06 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ఈ సందర్భంగా సిపి శ్రీ‌నివాస్‌ మాట్లాడుతూ…. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుంద‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్ లు సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, గౌస్ , రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.