60 లక్షల సభ్యత్వాలను ఆన్లైన్ చేసిన ఏకైక పార్టీ టిఆర్ఎస్: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: దేశంలో 60 లక్షల సభ్యత్వాలను ఆన్లైన్ చేసిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం ఆరెగూడెంకు చెందిన 30 మంది కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో యార మహేందర్, ఉపేందర్, అనుమల యాకయ్య, సుధాకర్, నాగయ్య తదితరులు ఉన్నారు. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 60 లక్షల సభ్యత్వాలను ఆన్లైన్ చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. అలాగే దేశంలో పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని మంత్రి తెలిపారు.