కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్రైమ‌రీ టీచ‌ర్ పోస్టుల‌కు చివ‌రి తేదీ డిసెంబ‌ర్‌26

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాల‌యాల్లో 6,414 ప్రైమ‌రీ టీచ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. 30 ఏళ్లలోపు ఉన్న వారు త‌గిన విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జీతం రూ. 35,400 నుండి రూ.1,25,400 వ‌ర‌కు ఉంటుంది. అభ్య‌ర్థులు సినియ‌ర్ సెకండ‌రీ, డిఇఎల్ ఇడి, డిఇఎల్ ఇడి (స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌) లేదా సీనియ‌ర్ సెకండ‌రీ, బిఇఎల్ ఇడి లేదా డిగ్రీ, బిఇడి ఉత్తీర్ణ‌త‌తోపాటు సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజిబిలిటి టెస్ట్ (సిటెట్ ) పేప‌ర్‌-1లో అర్హ‌త సాధించి ఉండాలి. పూర్తి వివ‌రాల‌కు https://www.kvsangathan.nic.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

1 Comment
  1. myhome says

    I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.

Your email address will not be published.