రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య

బెంగళూరు: క‌ర్ణాట‌క‌లో విషాద‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘ‌టన రాయ్‌బాగ్‌ తాలూకలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులను అన్నప్ప (60), మహాదేవి (50), సంతోష్ (26), దత్తాత్రేయ (28)గా గుర్తించారు. వీరిది రాయ్‌బాగ్‌ తాలుకలోని భీరాడి గ్రామం. అయితే అన్నప్ప, మహాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘ‌టనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.