India Corona: తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది.
ఇక 24 గంటల్లో 1,89,232 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రికవరీలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం దేశంలో 14,77,799 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,677 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,46,759 కి చేరింది.