Mancherial: వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని రామ్నగర్, ఎన్టీఆర్ నగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన గోదావరి, రాళ్లవాగు వరదల వచ్చిన విషయం తెలిసిందే. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల ప్రజలకు ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Wow, marvelous weblog layout! How lengthy have you been blogging for? you made running a blog look easy. The full look of your site is wonderful, as neatly as the content material!!