ఆంధ్రలో బిజెపి తొలి గెలుపు

ఆంధ్రలో బిజెపి తొలి గెలుపు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం దిశగాదూసుకువెళ్తున్నారు. ఇప్పటికే టిడిపికి చెందిన ఇద్దరు విజయం నమోదు చేశారు. తాజాగా బిజెపి అభ్యర్థి తొలి గెలుపును నమోదు చేశారు.
కూటమి నుంచి పోటీ చేసిన తూర్పు గోదావరి జిల్లా అననపర్తి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అబ్యర్థి ఎస్ సూర్యనారాయణ రెడ్డిపై 20567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.