గ్రామాభివృద్దికి రూ.కోటి విలువ చేసే స్థ‌లం ఇచ్చిన వృద్ధ‌దంప‌తులు

చొప్ప‌దండి (CLiC2NEWS): గ్రామాభివృద్ధికోసం వృద్ద దంప‌తులు రూ. కోటి విలువ చేసే స్థ‌లాన్ని విరాళంగా ఇచ్చారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌డుగు మండ‌లం గోలిరామ‌య్య ప‌ల్లికి చెందిన నునుకొండ‌ ల‌స్మ‌య్య‌, రామ‌మ్మ‌కు ముగ్గురు సంతానం చిన్న కొడుకు ప్ర‌భాక‌ర్ 2004లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ త‌న నేత్రాల‌ను దానం చేయాల‌ని త‌ల్లిదండ్రుల‌ను కోరాడు. అయితే అది కుద‌ర‌లేదు. అందుకు ప్ర‌తిగా త‌న కుమారిడికి చెందిన ఆస్తి వాటాను గ్రామానికి విరాళంగా ఇచ్చారు. సుమారు రూ. కోటి విలువ చేసే ఎక‌రం ఆరు గుంట‌ల స్థ‌లాన్ని గ్రామాభివృద్ది కోసం మాజి స‌ర్పంచ్ అంజ‌న్ ప్ర‌సాద్‌కు అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.