మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబుకు కరోనా

హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా బాడిన సంగతి తెలిసిందే. తాజాగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబుకు కరోనా పాజటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
I, along with my security personnel, Mr. S. Srinivas, have tested positive for COVID -19.
*I’m doing fine and currently under quarantine and so is Mr. S. Srinivas*. I request all those, who were in touch with me recently, *to get tested, follow the laid down protocols.— Sridhar Babu Duddilla (@OffDSB) November 4, 2020