పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

పెద్దపల్లి (CLiC2NEWS): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఓ రైస్మిల్లు డ్రైవర్ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మిల్లులో తల్లితోపాటు నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి బాలిక కనిపించకపోయే సరికి తోటి కార్మికులతో కలిసి సమీప పరిసరాల్లో వెతికగా.. నిందుతుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.