జులై 31తో ముగియనున్న ఐటిఐలో ప్రవేశాల దరఖాస్తుల గడువు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హత, కాస్ట్, స్టడీ, లోకల్ సర్టిఫికెట్లతో పాటు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటీను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలకు http://iti.telangana.gov.in వెబ్సైట్ చూడగలరు.