APకి మరో 3 లక్షల టీకాలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అందిస్తున్నారు. కొన్ని రోజులుగా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో టీకాలు ఇవ్వవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాగా, గురువారం ఉదయం ఢిల్లీ నుంచి సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన 3 లక్షల కోవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. టీకాలను వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి అవసరమైన జిల్లాలకు పంపిణి చేయనున్నారు.