AP: మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు
అమరావతి (CLiC2NEWS): కరోనా కారణంగా గతంలో 12 గంటల వరకే లావాదేవీలను నిర్వహించిన బ్యాంకులు లాక్డౌన్ సడలింపు నిర్ణయం వల్ల మధ్యాహ్నం 2 గంటల వరకు లావాదేవీలను కొనసాగించాలని నిర్ణయించాయి.
2 నుంచి 4 గంటల వరకు బ్యాంకు అంతర్గత విధులు కొనసాగుతాయని, బ్యాంకు కార్యాలయాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు విధులు ఉంటాయని పేర్కొన్నారు.