AP Corona: కొత్తగా 13,400 కేసులు.. 94 మరణాలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 13,400 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,85,142 కు చేరింది.
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 94 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 10,832 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 21,133 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 15,08,515 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.