AP Corona: కొత్త‌గా 22,399 కేసులు.. 89 మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 96,446 శాంపిల్స్ పరీక్షించగా 22,399 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 89 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాతో 9,077 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో 18,638 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,56,666 క‌రోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785 కి చేరింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 2,01,042 గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.