AP Corona: త‌గ్గుతున్న కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 83,461 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 7,943 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 16,93,085కు చేరింది. అలాగే 24 గంట‌ల్లో 19,845 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన‌వారు 15,28,260కు పెరిగింది. తాజాగా రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డి 98 మంది మృతిచెందారు. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు 10,930 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.