AP Corona: మరోసారి 22వేలు దాటిన కరోనా కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 89,087 శాంపిల్స్ పరీక్షించగా 22,018 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో 24 గంటల్లోనే కోవిడ్తో 96 మంది మృతి చెందారు . ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 9,173 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,117 మంది పూర్తిస్థాయిలో
కరోనా నుంచి కోలుకున్నారు.. ఇప్పటి వరకు 11,56,666 కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,88,803 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,03,787 ఉన్నాయి.