AP Corona: 23,920 కొత్త కేసులు.. 83 మంది మృతి

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో తాజాగా 23,920 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఎపిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 11,45,022 కేసులు నమోదయ్యాయి. వీటిలో 9,93,708 మంది కోలుకొని డిశ్చార్జ్ అయా్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 83 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 8136కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 2945, గుంటూరులో 2384, తూర్పు గోదావరి జిల్లాలో 2831, కర్నూలులో 2516, శ్రీకాకుళంలో 2724 కేసులు నమోదయ్యాయి.