కొణిదెల గ్రామానికి ఎపి డిసిఎం రూ.50 ల‌క్ష‌లు అంజేత‌

నంద్యాల (CLiC2NEWS): ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్.. త‌న ఇంటిపేరుతో ఉన్న గ్రామానికి రూ.50 ల‌క్ష‌లు అంద‌జేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండ‌లంలో ఉన్న కొణిదెల గ్రామాభివృద్దికి ఆయ‌న విరాళం అందించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి మేరకు గ్రామాభివృద్దికి తాజాగా రూ.50ల‌క్ష‌లు మంజూరు చేశారు. కర్నూలు జిల్ల పూడిచెర్ల‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌టించిన‌పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే జ‌య‌సూర్య క‌లిపి కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాల‌ని కోరారు. ఆ గ్రామాన్ని సొంత నిధుల‌తో అభివృద్ది చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కొణిదెల‌లో పూర్తి స్థాయిలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్ర‌ణాళిక రూపొందించింద‌ని, గ్రామ‌స్థుల అభ్య‌ర్థ‌న ప్ర‌కారం గ్రామంలో 90వేల లీట‌ర్ల సామ‌ర్ధ్యంతో ట్యాంకు నిర్మించ‌డంతో పాటు రోడ్లు, మురుగు కాల్వులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న‌ట్లు స‌మాచారం.

నంద్యాల క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ‌వారం విరాళానికి సంబంధించిన చెక్కును జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ రాజ‌కుమారి డిఆర్ ఒ రామునాయ‌క్‌, ప‌రిపాల‌నాధికారి ర‌వికుమార్‌, సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ న‌ర‌సింహారావుకు అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.