రిపబ్లిక్ డే పరేడ్కి ఎంపికైన ఎపి శకటం ప్రబల తీర్థం
ఢిల్లీ (CLiC2NEWS): జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. ఎపి శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో సంక్రాంతి వేడుకలు ఇతివృత్తంగా ఉన్నటువంటి ఎపి శకటం అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. దక్షిణ భారతం నుండి ఎపితో పాటుకేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం దక్కింది.