లోన్ యాప్స్ పట్ల జాగ్రత్త.. డిసిపి అఖిల్ మహజన్

లోన్ యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

మంచిర్యాల (CLiC2NEWS): లోన్ యాప్స్ ప‌ట్ల ప్రజలను అప్రమత్తంగా  ఉండాల‌ని మంచిర్యాల ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్  తెలిపారు . ఈ యాప్‌ల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని..యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు.

లోన్ యాప్ మోసాలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని. గూగుల్ ప్లే స్టోర్ లో చాలా న‌కిలీ లోన్ యాప్స్ ఉన్నాయ‌ని అన్నారు. టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా సేవ‌లు మ‌రింత సుల‌భంగా మారాయి. ఇదే క్ర‌మంలోనే టెక్నాల‌జీని త‌ప్పుడు ప‌నుల‌కు ఉప‌యోగించ‌డం కూడా క్ర‌మంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ మోసాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి అని లోన్ యాప్ ల మాయ‌లో ప‌డొద్ద‌ని సూచించారు.”చాలా యాప్‌లు ఫోన్ ద్వారా రుణాలను అందిస్తాయి. అవసరమైన వ్యక్తులు వారి పరిచయాలను యాక్సెస్ చేయడానికి అనుమతులను అనుమతించడం ద్వారా అంగీకరిస్తారు. వారు (కంపెనీ) అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు, ఎవరైనా తిరిగి చెల్లించడంలో విఫలమైతే/ఆలస్యం చేస్తే, వారు తమ కాంటాక్ట్‌లందరినీ సంప్రదించడం/మెసేజ్ చేయడం ద్వారా వేధించడం ప్రారంభిస్తారు” అని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నవారిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో పాటు భ‌య‌పెడుతూ.. అధికంగా వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నార‌ని హెచ్చిరించారు. లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చెసుకున్న‌ద‌ని తెలిపారు. లోన్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.