రక్తదానంతో మరొకరికి ప్రాణదానం: సిపి ఎం. శ్రీనివాస్

గోదావరిఖని (CLiC2NEWS): మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని సిపి ఎం.శ్రీ‌నివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, హాజర‌య్యారు. పోలీస్ అధికారులతో కలిసి ఆయ‌న‌ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. అమరవీర జవానులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింద‌ని తెలిపారు. అన్నిటికంటే గొప్పదానమైన రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడాలని సూచించారు. సకాలంలో రక్తం అందించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయ్యారని రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు.

ర‌క్త‌దాన శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత 200 మంది పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి సిపి సర్టిఫికేట్లను అందజేశారు.ఈకార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, మంథని సిఐ రాజు, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.