టిఆర్ఎస్లో చేరిన సింగరేణి బీఎంఎస్ అధ్యక్షుడు మల్లయ్య

హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి కోల్మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి మల్లయ్య టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లయ్యకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కెటిఆర్. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.