హనుమకొండ, వరంగల్ న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్..!
వరంగల్ (CLiC2NEWS): హనుమకొండ, వరంగల్ జిల్లా న్యాయస్థానాలోలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు ఓ దుండగుడు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే గతంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. తాజాగా మరోసారి రావడం గమనార్హం.