Corona: ఎపిలో 12,634 కేసులు.. 69 మరణాలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా గా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1033560 కు చేరింది.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,304 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 936143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 69 మంది మృతి చెందారు. తాజా కేసలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7685 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89732 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.