తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి కొవిడ్ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి!

తిరుమల (CLiC2NEWS): శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని తిరుమ‌ల తిరుప‌తి దేశ‌స్థానం పేర్కొంది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు క‌రోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్లు విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలానే సర్వదర్శనం టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది..

Leave A Reply

Your email address will not be published.