DRT: బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా విజ‌య్‌కుమార్. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రిగా శ్రీ‌థ‌ర్ రెడ్డి ఎన్నిక‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని అబిడ్స్‌లో ఉన్న డిఆర్‌టి కోర్ట్ బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు గురువారం ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా సీనియ‌ర్ న్యాయ‌వాది టి. విజ‌య్‌కుమార్ .. ఉపాధ్యక్షుడిగా క‌ల్యాణ్ చ‌క్ర‌వర్తి ఎన్నిక‌య్యారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి గా టి. శ్రీ‌థ‌ర్ రెడ్డి, జాయింట్ సెక్రెట‌రీగా న‌రేష్ అనుగుల‌,  ట్రెజ‌ర‌ర్ గా ఎస్.శ్రీ‌కాంత్‌, స్పోర్ట్స్ & క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రిగా జి. కిర‌ణ్ రాజ్‌, లైబ్రేరియ‌న్ గా ఎ . త‌నూజ‌, ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ (మేల్‌) కె. సురేష్‌, క్రాంతి కుమార్‌, పి. బాబు సాయినాథ్ రావు.. ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ (ఫిమేల్) జి. జెస్సిక‌, మౌనిక‌ ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌లు ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన వారికి న్యాయ‌వాదులంతా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

(మాజి ప్రెసిడెంట్ దేశ్‌పాండే నివాసానికి వెళ్లి, ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న నూత‌న బార్ అసోసియేష‌న్‌ కార్య‌వ‌ర్గం)

 

అనంతరం మాజీ ప్రెసిడెంట్ జి కె Deshpande నివాసానికి వెళ్ళి ఆయనకు ఎన్నికల్లో గెలుపొందిన ప్రెసిడెంట్ టి.విజ‌య్‌కుమార్ , ఉపాధ్యక్షు డు క‌ల్యాణ్ చ‌క్ర‌వర్తి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి టి. శ్రీ‌థ‌ర్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు

 

Leave A Reply

Your email address will not be published.