హైదరాబాద్ నుండి అమ‌రావ‌తికి వ‌చ్చి ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి పొడిగింపు

అమ‌రావ‌తి (CLiC2NEWS): హైదారాబాద్ నుండి అమ‌రావ‌తికి వ‌చ్చి విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు మ‌రో ఏడాది ఉచిత వ‌సతి స‌దుపాయం పొడిగించింది ఎపి ప్ర‌భుత్వం. స‌చివాలయం, అసెంబ్లీ, హెచ్ ఒడి, రాజ్ భ‌వ‌న్ లో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు ఈ సౌకర్యం క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు ప్ర‌కారం..ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప‌నిచేస్తున్న వారికి 2024 జూన్ 27 నుండి వ‌చ్చే ఏడాది జూన్ 26 వ‌ర‌కు ఉచిత వ‌స‌తి వ‌ర్తిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.