హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు ఒక్కొక్కరికి రూ. 13 కోట్లు జమ
చెన్నై (CLiC2NEWS): తమిళనాడులోని హెచ్డిఎఫ్సి బ్యాంక్కు చెందిన ఓ బ్రాంచ్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమయ్యాయి. వందమంది ఖాతల్లో ఒక్కొక్కరికి రూ. 13కోట్ల నగదు జమయ్యాయి. దీనిపై స్పందించిన బ్యాంక్ అధికారులు.. పొరపాటున నగదు జమ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఖాతాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బ్యాంక్ సర్వర్ హ్యాక్కు గురైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీసును హ్యక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.