శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత బొప్ప‌న స‌త్య‌నారాయ‌ణ‌రావు క‌న్నుమూత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS):  శ్రీచైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత డాక్ట‌ర్ బొప్ప‌న స‌త్య‌నారాయ‌ణ రావు (బిఎస్‌రావు) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. ఇంగ్లండ్‌, ఇరాన్ దేశాల‌లో బిఎస్ రావు వైద్యులుగా సేవ‌లందించారు. 1986 మొద‌టిసారిగా విజ‌య‌వాడ‌లో శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల‌ను స్థాపించారు. విజ‌య‌వాడ‌లో మొద‌ట బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌ను ప్రారంభించి.. అనంత‌రం దేశ‌వ్యాప్తంగా అంచెలంచెలుగా విస్తరించారు. ప్ర‌స్తుతం దేశంలో 321 జూనియ‌ర్ కేలేజీలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సిబిఎస్ ఇ స్కూల్స్ ఉన్నాయి. ఈ విద్యాసంస్థ‌ల్లో సుమారు 8.5 ల‌క్ష‌ల మంది విద్యార్థులు విద్య‌న‌భ్య‌సిస్తున్నారు.

1 Comment
  1. sbo bet says

    Hi there! This article could not be written any
    better! Going through this article reminds me of my previous roommate!
    He constantly kept talking about this. I’ll forward this article to him.

    Pretty sure he’ll have a great read. Thanks for sharing!

Leave A Reply

Your email address will not be published.