మే 20 వ‌ర‌కు ఉపాధ్యాయుల‌కు సెల‌వులు ర‌ద్దు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వులు ర‌ద్దు చేసింది. మే 20 వ‌ర‌కు సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీకి మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల‌కు మే 6 నుండి జులై 3 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ శ‌నివారం ఆదేశాలు జారీ చేసింది. జులై 4 నుండి కొత్త విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో మే 20 త‌ర్వాతే ఉపాధ్యాయుల‌కు సెల‌వులు అందుబాటులోకి రానున్నాయి.

1 Comment
  1. Saleem khan says

    It’s excellent news coverage platform.
    One our issue is there. తెలంగాణ రాష్ట్రం లో నిర్వహించిన మొదటి TRT-2017 లో నాణ్యమైన రాష్ట్ర టాప్ ర్యాంకర్లైన విద్వాన్ విశారద అభ్యర్థులకు జీఓ 25 వల్ల తీవ్ర అన్యాయం జరిగింది. పూర్తి వివరాలు తెలియజేస్తాను. గుడ్డి ప్రభుత్వం ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. నా నెంబర్ 7981921846.

Leave A Reply

Your email address will not be published.