జలమండలిలో ఘనంగా ఈద్ మిలాప్
హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జలమండలి ఎండీ దానకిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఉద్యోగులు అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణా, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అసోసియేట్ ప్రసిడెంట్లు రాజ్ రెడ్డి, జహంగీర్, ప్రధాన కార్యదర్శి జైరాజ్, మేవా అధ్యక్షుడు ఖాజా జౌహర్ అలీ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అక్తర్ అలీ, వర్కింగ్ ప్రసిడెంట్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.