India Corona: కాస్త తగ్గిన కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 3,43,144 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఈ మేర‌కే కేంద్ర వైద్యారోగ్య‌శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,40,46,809 కి చేరింది. ఇందులో 2,00,79,599 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4000 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,62,317 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,44,776 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం. ప్ర‌స్తుతం దేశంలో 37,04,893 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.